Spread the loveమద్నూర్, జూలై 23 (న్యూస్లైన్): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ నేతలు ముందుగా ప్రత్యేక కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి తమ ఉదారతను చాటుకున్నారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో మండల అధ్యక్షుడు బన్సీ పటేల్, సీనియర్ నాయకులు రౌత్వార్ నాగనాథ్, కాంచన హన్మాండ్లు, లో కృష్ణా పటేల్ తో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. Post navigation జుక్కల్ నియోజకవర్గంలో వెల్లువలా ప్రజా సమస్యలు: హామీలు ఏమయ్యాయి ఎమ్మెల్యే గారు ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలి: మద్నూర్లో కాంగ్రెస్ ధర్నా