Spread the love

డోంగ్లీ గ్రామానికి సమీపంలోని రాచన్న ఆలయానికి ముందున్న ప్రధాన రహదారిపై వరద నీరు భారీగా ప్రవహిస్తుండటంతో తీవ్ర రాకపోకల విఘాతం ఏర్పడింది. పైనుంచి ముంచెత్తుతున్న నీటి ప్రవాహంతో చుట్టుపక్కల పంట పొలాలన్నీ సంపూర్ణంగా నీట మునిగిపోయాయి.
​రహదారిపైనుంచి ప్రవహిస్తున్న వరద కారణంగా నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు, స్థానిక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ వెంటనే ఓ వంతెన (బ్రిడ్జి) నిర్మిస్తే రాకపోకల సమస్య తీరడమే కాకుండా, పంట పొలాలు నీటమునగకుండా కాపాడుకోవచ్చని స్థానిక ప్రవీణ్ మేంగే, విట్టల్ అవుటే మరియు ఇతర రైతులు కోరుతున్నారు.
​ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి, ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి తమ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *